పవన్ కు కోపమొచ్చింది, జగన్ కు వార్నింగ్

రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జగన్మోహన్  రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు తప్ప ఒక రాష్ట్ర  సీఎం గా భావించడం లేదు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టిడిపి కాదు.ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
‘‘గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి.అయితే అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు.అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలి,’’ అని ఆయన అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదని చెబుతేూ  ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకునేది లేదని కూడా ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: వార్నింగ్ , 5 శాతానికి పడిపోయిన జిడిపి
గతంలో భూసేకరణ ను కూడా మేం‌ వ్యతిరేకించామని, ఇపుడు
ఇప్పుడు రాజధాని మార్పు ను కూడా వ్యతిరేకిస్తున్నామని ఆయన ప్రకటించారు. రైతుల కు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పవన్ ఇంకా ఏమన్నారంటే…
రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తాం.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తాం.
మంత్రి బొత్సా సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది.
అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు.
రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన పై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి.
తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు.
వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా.. ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది
రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేకానేక ఇబ్బందులు పడుతున్నారు.
90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
మంచి చేస్తారని సిఎం‌ను‌ చేస్తే… ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు.
రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది