ఆంధ్రలో తుగ్లక్ పాలన: జగన్ మీద తులసి రెడ్డి ధ్వజం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో తుగ్లక్ పాలన నడుస్తూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ పాలనా తీరు మీద ఇంత తీవ్రమయన వ్యాఖ్య ఎవరూ చేయలేదు.
ఈ రోజు ఆయన విజయవాడలో విలేకరులతో   మాట్లాడుతూ కాసులకోసమే రాష్ట్ర  పభుత్వాలు అంటే గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజక్టును వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
తులసి రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
*పోలవరం ప్రాజెక్టు ప్రకృతి ఆంధ్రప్రదేశ్ కి ప్రసాదించిన ఒక వరం
* ఈ ప్రాజక్టు వల్ల పరోక్షంగా గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం జరుగుతుంది
*పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు
*దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడం కారణంగా ప్రాజెక్టు వెనుకబడి పోయింది
*బిజెపి ప్రభుత్వం చట్టప్రకారం పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై నెట్టేసింది
*రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం కక్కుర్తితో పోలవరం బాధ్యతలు తమ నెత్తిపై వేసుకున్నాయి
*జగన్ పాలన తుగ్లక్ పాలనగా ఉంది
*రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం పూర్తి కాకుండా జగన్ అడ్డుపడుతున్నాడు
*ఏపి పునవ్యవస్థీకరన ప్రకారం చట్టం సెక్షన్ 90 ద్వారా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఆధీనంలోకి తీసుకోవాలి
*నిర్వాసితులందరికి న్యాయం చేయాలి
*4554 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రియర్బ్రెస్ చేయాలి
*55,549 కోట్ల రూపాయల సవరించిన అంచనాలను కేంద్ర మంత్రిత్వశాఖ ఆమోదించాలి

https://trendingtelugunews.com/tirumala-laddus-demand-on-the-rise/