తలనీలాల విక్రయం ద్వారా శ్రీవారి రాబడి రూ.6.01 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.6.01 కోట్ల ఆదాయాన్ని గడించిందని టిటిడి వెల్లడించింది.
ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. మొదటి, రెండు, మూడు, నాలుగు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 76,500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.
మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 4,600 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,333/-గా ఉన్న బి క్యాట‌గిరి – 1000 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.
రెండో రకం తలనీలాలో కిలో రూ.17,814/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 4,400 కిలోలను వేలానికి ఉంచగా 1,500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.267.21 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,607/-గా ఉన్న బి క్యాట‌గిరి – 7,000 కిలోలు వేలానికి ఉంచగా 2,100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.180.76 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.
మూడో రకం తలనీలాలో కిలో రూ.6,041/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 1,400 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.84.65 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాట‌గిరి – 22,900 కిలోలు వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.1,801/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 6,600 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.5.40 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.
కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 71,000 కిలోలను వేలానికి ఉంచగా అన్నీఅమ్ముడుపోయాయి. తద్వారా రూ.27 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.