ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా విజయానంద్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.