దీక్ష విరమించిన భట్టి

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సూచనల మేరకునిమ్స్ లో కొనసాగిస్తున్న  దీక్షను సిఎల్ పి లీడర్ భట్టి విక్రమార్క మల్లు విరమించారు.   పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్మ రసం ఇచ్చారు. రాజ్యసభసభ్యుడు కెవిపి రామచంద్రరావు,  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు  నిమ్స్ కు వచ్చి భట్టిని పరామర్శించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసనగా ఆయన నిరాహారదీక్ష ప్రారంభించారు.