ఆంధ్ర ప్రదేశ్ లో పేదరైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల చలామణీపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దని ఈ రోజు వ్యవసాయ రంగం మీద సమీక్షచేస్తూ ఆదేశించారు.
ఈ సమస్య పై విత్తన చట్టం తేవాలని ఆయన అధికారులు సూచించారు. దీని మీద అవసరమైతే అసెంబ్లీ లో చర్చించి చట్టం తెస్తామని జగన్ చెప్పారు.
అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రం చేయాలని, రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామా సచివాలయాల ద్వారా జరిగేల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన విత్తనాలు గ్రామా సచివాలయాల ద్వార రైతులకు పంపిణీ జరిగేల చర్యలు తీసుకోవాలని, అవినీతి జరిగిందంటే ఎవరు క్షమించలేని చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించాలి, ఉత్తమమైన సలహాలు ఇస్తే చాల సంతోషిస్తాను, అటువంటి వారికి సన్మానం చేస్తానని ఆయన పేర్కొన్నారు.