కరోనా నుండి కోలుకున్న వైసీపీ ఎమ్మెల్యే

తెనాలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే  శివకుమార్ కరోనా నుండి కోలుకున్నారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రావడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జులై 19 న శివకుమార్ కరోనా సోకిందనే అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయనే వీడియో ద్వారా అభిమానులకు తెలియజేసారు.
సన్నిహితులకు, అభిమానులకు తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ కలత చెందవద్దని వీడియో సందేశం ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ కి అందుబాటులో ఉంటానని, ఆందోళన వద్దని చెప్పారు.
కాగా ఆదివారం మరోసారి శివకుమార్ కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రిజల్ట్స్ లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో తెనాలిలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
photo credits: facebook