తెలంగాణలో నేటి కరోనా కొత్త కేసులు 1278, మరణాలు 8

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 8మంది మృతి చెందారు. గత 24 గంటలలో రాష్ట్రంలో 10354 శాంపిల్స్ పరీక్షించారు. ఈ రోజుకి రాష్ట్రంలో మొత్తం కనిపించిన కరోనా కేసులు 32,224. ఇందులో ఇంతవరకు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు 19,205 మంది. ఇపుడు ఆసుప్రతులో వున్న యాక్టివ్ కేసులు 12,680. ఈరోజుకి మొత్తం కరోనా మృతులు 339.
జిల్లాల వారీగా కరోనా కేసులు:
ఎప్పటిలాగానే జిహెచ్ ఎం సి అగ్రభాగాన ఉంది. జిహెచ్ ఎంసిలు నేడు నమోదయిన కేసులు 762, రంగారెడ్డి జిల్లాలో171 కేసులు నమోదయ్యాయి ఇక మూడో స్థానంలో ఉన్న  మేడ్చెల్ లో 85 నమోదయ్యాయి. ఇతర జిల్లాకు సంబంధించిన వివరాలు:  సంగారెడ్డి-36, నల్గొండ-32, కామారెడ్డి-23, మెదక్-22, ఖమ్మం-18, మంచిర్యాల-17, మహబూబ్నగర్-14, ఆదిలాబాద్-14, సూర్యాపేట-14 నమోదు.