కాంగ్రెస్ కు దెబ్బ, టిఆర్ ఎస్ కు చికాకు. కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యేకోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి న్యూయర్ సర్ప్రైజ్ షాకిచ్చారు.
తాను భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. కొత్త సంవత్సరం రోజున ఆయన తిరుమలో వెేంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నాక ఈ విషయం చెప్పారు. తాను బిజెపిలోకి వెళ్లినా తన సోదరుడు వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారనికూడా ఆయన చెప్పారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని, అందుకే తాను బిజెపిలో చేరాలనుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తన నిర్ణయం మారదని కూడా చెప్పారు.