కరోనా వార్డులో అగ్ని ప్రమాదం 5 గురు మృతి

గుజరాత్ రాజ్ కోట్ లోని కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో  అయిదుగురు చనిపోయారు.
కోవిడ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో  శుక్రవారం ఉదయమే ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగే సమయానికి ఇక్కడి వార్డులో 28 మంది కరోనా బాధితులు చికిత్సపొందుతునారు. ఆసుపత్రి పేరు ఉదయ్ శివానంద్. ఇది కోవిడ్ డిసిగ్నేటడ్ ఆసుపత్రి . రాజ్ కోట్ మావ్డి ఏరియాలో ఈ ఆసుపత్రి ఉంది.
ముగ్గురు ఐసియులోనే చనిపోయారు. ఇప్పటికి మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులుచెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *