కరొనా అంటే భయం వద్దు, హైదరాబాద్ ఎమర్జన్సీ మీటింగ్ సూచన

కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
అదే విధంగా కరోన వైరస్ పైన అసత్యాలను ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో కరొన వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు కొద్ది సేపటి కిందట ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరుగుతున్న ఈ సమావేశానికి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు అధిపతులు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కరొన వైరస్ సోకితేనే చనిపోతారు అన్న ప్రచారం లో ఏమాత్రం వాస్తవం లేదు  కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని సమావేశం ప్రజలకు సూచించారు.
సమావేశం వెల్లడించిన విశేషాలు:
ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరొనా మెడికేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయి
పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే పాజిటివ్ ప్రచారం నిర్వహించాలి
ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలి
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు
సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సూచన
24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటు తో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింత గా పెంచాలి
గతంలో వచ్చిన ఇతర వైరస్ ల తో పోల్చితే కరోనా వైరస్ లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుంది
ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని మంత్రుల హాామి.