వైసిపి కొత్త పాట: ‘బాబు కూల్చేసిన గుడుల పునర్నిర్మాణం‘

చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను మా ప్ర‌భుత్వం నిర్మిస్తోంది: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్

చంద్రబాబు తన హయాంలో కూల్చేశాడని, ఆ ఆలయాలను పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధమైందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చాక హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని దీనికి పరాకాష్ట రామతీర్థం శ్రీరాముడిశిరచ్ఛేదం అని బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆందోళనచేస్తున్నసయమంలో వైసిపి ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమం చేపడుతూ ఉంది.

కూల్చివేత‌కు గురైన ఆ దేవాల‌యాల పున‌ర్మిర్మాణానికి ఈనెల 8న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు .

గతంలో  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు  విజయవాడలో కూల్చివేసిన  దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు–కేతు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు గుడులను తిరిగి నిర్మిస్తామని వెల్లంపల్లి చెప్పారు.

ఈనెల 8న ఉదయం 11.01 గంటలకు ఆలయాల నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అదే విధంగా రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. 13 జిల్లాల్లో 40 దేవాలయాల పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *