ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు  2000లు దాటాయి. గత 24 గంటలలో కొత్తగా 38కరోన పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ బులెటీన్ వెల్లడించింది. రోజూవారి బులెటీన్ ను కొద్ద సేపటి కిందట విడుదల చేశారు.
కొత్తగా నమోదైనకేసులలో అనంతపురంనుంచి 8,చిత్తూర్ 9,గుంటూరు5,కృష్ణా3,కర్నూలు 9,నెల్లూరు1,విశాఖపట్నం3 ఉన్నాయి.
ఇప్పటివరకు 998మంది చికిత్స తీసుకుని డిచార్జ్ అయ్యారు.ఇక రాష్ట్రంలో కరోనా వల్ల 45మంది మృతి చెందారు. ఇపుడు  975 చికిత్స పొందుతున్నారు.