ఇక చాలు, సమ్మె పొడిగించి చంపకండంటున్న ఆర్టీసి డ్రైవర్ రాజు

సమ్మె ఇక చాలు, కెసిఆర్ దేవుడు ఏవో వరాలిస్తున్నాడు, అవి తీసుకుని హాయిగా ఉందామంటున్నాడు హైదరాబాద్ ఆర్టీసి డ్రైవర్ రాజు. నెలల తరబడి సమ్మెఏందయ్యా, పొట్టి శ్రీరాములుకు జరిగినట్లు మనందరికిజరుగుతుందని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ఇతర డ్రైవర్లు, కండక్టర్లు కూాడా ఆయన దారే పడతారా? కెసిఆర్ వైఖరితో చాలా మంది ఆర్టీసి సిబ్బంది భయపడుతున్నారు. ఆర్టీసి ప్రయవేటీకరణను ఎవరూ ఆపలేరని ఆయన వేసిన బాణం తాటాకుచప్పుడని తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండ్ రామ్ అన్నా, అంతానిబ్బరం, సమ్మెకాలంలో జీతం లేకుండా బతికే శక్తి అందరికి ఉండదు కదా. అందుకే డ్రైవర్ రాజు కెసిఆర్ ప్రకటనలోవరమంటున్నాడు. మరొక వైపు తాను డ్యూటీలో చేరడానికి రెడీ గా ఉన్నానని డిపోమేనేజర్ కు లేఖ కూడారాశాడు. ఇక ఇలాంటి లేఖలెన్ని వస్తాయో చూడాలి.