తెలంగాణ రెవెన్యూ కార్యాలయాల్లో పుల్ సెక్యూరిటీ

-పోలీసుల సహకారంతో రెవెన్యూ కార్యాలయాల దగ్గర భద్రత
-అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు
-ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయం
-జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు జారీ

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర పోలీసుల సహకారంతో భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. కలెక్టర్ల దగ్గర అందుబాటులో ఉన్న నిధులతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని, ఆ సమయంలో సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.