జలవిహార్ దగ్గిరే తొలి నీరా స్టాల్

ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్  ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్న మొట్టమొటి నీరా స్టాల్ కోసం స్థలాన్వేషణ మొదలుపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా  నీరా కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్  ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్ కుమార్, టూరిజం ఎండి మనోహర్ తో కలిసి నక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద స్థలాన్ని పరిశీలించారు.
స్థలాన్ని సర్వే చేసి, ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆర్కిటెక్ట్ ను ఆదేశించారు.
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, కెసిఆర్  ముఖ్యమంత్రి అయ్యాక కులవృత్తుల సంక్షేమంకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారఅని అన్నారు.
అందులో భాగంగా గౌడ కుల వృత్తిని ఆదుకోవడానికి నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ G.O No.116 ను విడుదల చేయడం జరిగిందనిచెప్పారు.
తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేసి నీరా స్టాల్ ను ఏర్పాటు చేస్తామని  అనంతరం విడుతల వారిగా జిల్లాలలో ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/telangana-government-to-open-first-neera-shot-in-hyderabad-with-local-delicacies/