తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ ఆనంద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ లంచం డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోదక శాఖ అధికారులు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు