జమ్మలమడుగు వైద్యులకు ఘన సత్కారం

జమ్మలమడుగు పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ అగస్టీన్ రాజు డాక్టర్ కె.పి రవీంద్ర లకు స్థానిక గడియారం సాహితీ పీఠంఅధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం ఎల్ నారాయణరెడ్డి,బండారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి మాట్లాడుతూ శనివారం డాక్టర్స్ డే సందర్భంగా ముందస్తుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సత్కరించటం జరిగిందన్నారుజమ్మలమడుగు ప్రాంతంలో డాక్టర్ అగస్టీన్ రాజు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు.

https://youtu.be/NKM5KJUDISU

అలాగే కంటి వైద్యులుగా రవీంద్ర సుమారు లక్షా డెబ్బై వేలకు పైగా ఆపరేషన్లు చేయడం ఒక రికార్డు అంటూ ఇది జమ్మలమడుగు ప్రాంతానికే గర్వకారణం అన్నారు. తమకు జరిగిన సత్కారం పట్ల డాక్టర్లు అగస్టీన్, రవీంద్ర లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గడియారం సాహితీ పీఠం సభ్యులు మిరియాల శివగణపతి , కొండారెడ్డి, లక్ష్మీ నారాయణ, గిరి , రాఘవ, దాదా ఖలందర్ , అమీర్, లైబ్రేరియన్లు జింకా చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *