సజ్జలకు ఆనం రెండు చిన్న ప్రశ్నలు…

 

*నేను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జలకు ఎలా తెలుసు?

 

*కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలి సజ్జల

**

నెల్లూరు : తాను క్రాస్  ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు, ఆయన సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డికి సవాల్ విసిరారు.

ఆయనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం , సజ్జలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నేను సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడానికో.. కుటుంబ సభ్యులను హత్య చేయడానికో రాజకీయాల్లోకి రాలేదు.” అన్నారు. ఆనం ఇంకా ఏమన్నారంటే….. ‘‘మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తారా? నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలుంటే బయట పెట్టండి. నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవాళ సజ్జల వంద కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలి. అధికార పక్షం అయినంత మాత్రాన  తప్పులు ఎత్తి చూపకూడదని లేదు. ఎత్తి చూపిస్తే తప్పులు సరి చేసుకోవాలి కానీ కక్ష సాధింపునకు దిగ కూడదు.

“క్రాస్ ఓటింగ్ చేశానో లేదో చెప్పాల్సింది నేను. నాపై ఆరోపణలు చేసే స్థాయి సజ్జలకు లేదు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల క్రితమే కుట్ర చేశారు.” అని అన్నారు.

” వ్యవస్థలు దిగజారుతున్నాయని సీఎంకు ఎప్పుడో చెప్పా. ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోంది. సీఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదు. టీడీపీలో ఏవైనా సమస్యలొస్తే.. వినేవారు.. అర్ధం చేసుకునేవారు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవు. నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని కోరలేదు. అధికారుల మెడపై కత్తి పెట్టి పని చేయమనడానికి.. మీరేం చక్రవర్తులు కాదు.. సామ్రాజ్యాదీశులు కాదు. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారు.”

వైసీపీ తర్వాత ఎటు అనేది చూడాలి. నా భవిష్యత్ ప్రారంభమైందే టీడీపీలో.. మా కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటా. నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ చేశాననడానికి ఆస్కారం లేదు’’ అని స్పష్టం చేశారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారంగా ఓటేశానని  రహస్యంగా జరిగే పోలింగ్ లో నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా తెలుసింది?

మొన్న ‘ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు, మేం అతడిని ఓటు అడగలేదు’ అని చెప్పి ఫలితాలు వచ్చిన తర్వాత రూ.20 కోట్లు తీసుకుని  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానడం తమాషా.

“సజ్జల   విలేకరిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల ఎలా ఎదిగాడో నాకు తెలుసు.  కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారు. అందరూ నీ లానే ఉంటారని అనుకుంటే ఎలాగ. డబ్బు తీసుకొని ఓటేయాల్సిన అవసరం నాకు లేదు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారు, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలి.” అని ఆనం అన్నారు.

వైసీపీ తర్వాత ఎటు అనేది చూడాలి అంటూ, ” నా భవిష్యత్ ప్రారంభమైందే టీడీపీలో.. మా కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటా. నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ చేశాననడానికి ఆస్కారం లేదు’’ అని ఆనం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *