పోరాట బాటలో ఏపీ ఉద్యోగులు

*చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదు

*ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

అమరావతి:- ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళనబాట పట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు సచివాలయంలో ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలిసి మార్చి 9 నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు.

అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ఈసారి చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలుత సెల్‌ డౌన్‌, పెన్‌ డౌన్‌, భోజన విరామ వేళ నిరసనలు, తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. అప్పటికీ స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *