చంద్రబాబు ఇక ఇంటికే: మంత్రి పెద్దిరెడ్డి

 

తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి తో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాటీతో మాట్లాడారు.

-కుప్పంలో చంద్రబాబు ఓటమి తథ్యంమని చెబుతూ
– పుంగనూరులో నాపై పోటీ చేసి గెలిసే సత్తా ఉందా బాబూ అని ప్రశ్నించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

 

*మేం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ… “నీ అంతుచూస్తా, నీ పని అయిపోయింది, కాస్కో..” లాంటిపదాలు ప్రయోగించాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. మా నేత జగన్ గారు, పార్టీలోని మంత్రులు, ఇతర నేతలు అంతా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. చంద్రబాబులా, తమ పార్టీ కార్యకర్తలు, తమ కుటుంబసభ్యులు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, దుష్ట చతుష్టయంల కోసం పనిచేయడం లేదు. కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నాం.

*జిల్లాలో అడుగు పెట్టిన నాటి నుంచి మాపైన ఏడుపే.

ఏ కార్యక్రమం చేపట్టినా జగన్ గారు ప్రజల సంక్షేమం కోసం, వారి కుటుంబాలు బాగుపడాలనే మంచి ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. మరి ఇవ్వన్నీ కూడా చంద్రబాబుకు తెలియనివి కావు. కానీ ఆయన ఎజెండా ఏమిటీ? ఈ జిల్లాకు వచ్చిన నాటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. పండుగ రోజు కుటుంబసభ్యులు, పిల్లా పాపలతో సంతోషంగా గడుపుకుంటున్న మాపై తెల్లవారుతూనే నా మీద, మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ గారిపైనా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ అదే ఏడపు. ఈ రోజు కడప నుంచి వస్తూ దారిలో చూస్తే ఆయన కోసం తెలుగుదేశం పార్టీకి చెందని వందిమాగధులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడూ రాని వ్యక్తికి పదిమంది వస్తే గొప్పనాయకుడిని అని అనుకుంటాడు. రోజు మాకు వేల మంది వస్తారు. మేం దానిని గొప్పగా అనుకోము. తనకోసం ఎదురుచూస్తున్న వారిని చూసి ఒళ్ళు మరిచిపోయి చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడు. దీనిని చిత్తూరు జిల్లా ప్రజలు సహించరు. ఎప్పుడో నీకు రాజకీయ భవిష్యత్తును చించేశారు. ఈ సారి ఉండేది కూడా పోతుంది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అని అనుకుంటే ప్రజలు ఊరుకోరు. ఈ జిల్లాలో తిరిగి నువ్వు మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండదు.

*చంద్రబాబూ.. నీ పని అయిపోయింది*

నిన్ననే చెప్పాను. చంద్రబాబు నీ పని అయిపోయింది. కుప్పంలో కూడా నీ జెండా పీకేసి, వైయస్ఆర్సిపి జెండా పాతుతాం. అక్కడ కూడా మా అభ్యర్ధే గెలుస్తారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇంతగా ఆరాటపడాల్సిన పనిలేదు. ఇప్పటికే చంద్రబాబు గాడితప్పాడు. ప్రజాసేవ నుంచి స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజకీయాలను వాడుకున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా తాను తన కుటుంబం కోసమే పనిచేశాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయలేదు. చివరికి తన మామను కూడా అడ్డం పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి మా గురించి మాట్లడటం ఒక రాక్షసుడు, ప్రజాకంఠకుడు ప్రజల గురించి మాట్లాడినట్లు ఉంది. ఇది ఇది చాలా విడ్డూరంగా ఉంది.

*

*పండుగ కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వడం లేదు.

చంద్రబాబు తన విమర్శలతో మమ్మల్ని ప్రశాంతంగా పండుగ జరుపుకోనివ్వకుండా, ఎదురు మాపైనే దాడి చేస్తున్నాడు. మా మీద నిత్యం ఏడుస్తూ, తనను పండుగ జరుపుకోనివ్వలేదని ఎలా అంటాడు? అన్ని మాటలు మాట్లాడేది చంద్రబాబే, తిరిగి పండుగ చేసుకోనివ్వలేదని మాపై ఎందుకు ఏడుస్తున్నాడు?

*నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించావు*

రఘురామకృష్ణంరాజును కొట్టినట్లు  చంద్రబాబు వ్యాఖ్యానించాడు. రఘురామకృష్ణంరాజును ఎవరు కొట్టారు… ఎక్కడ కొట్టారు…. చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్దతిగా రాజకీయాలు చేసే వారిని ఎవరూ అరెస్ట్ చేయరు. మితిమీరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకోకూడదు, అలా చేస్తే రాజకీయంగా చేశామని ఆరోపిస్తున్నాడు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎంత మందిని అకారణంగా అరెస్ట్ చేశావు, ఎంత మందిని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడ చిలుక పలుకులు మాట్లడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలా, ఉండకూడదా అనేది చంద్రబాబే తేల్చుకోవాలి. నీ అంతుచూస్తా, నీ పని అయిపోయిందని నా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఈ జిల్లా ప్రజలు ఉన్నన్ని రోజులు ప్రజలు మా పక్షాన, మేం ప్రజల పక్షాన ఉంటాం. నువ్వు ప్రజాకంఠకుడువి. గతంలో నువ్వు ఏ విధంగా ప్రజాకంఠన పరిపాలన చేశావో, ఏ విధంగా ప్రజలు నిన్ను ఛీ కొట్టారో అందరికీ తెలుసు.

*చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ సిపి గెలుపును అడ్డుకోవడం నీ తరం కాదు

చిత్తూరు జిల్లాలో మెజారిటీ సాధించాలంటే నీ నుంచి కాదు, నీ బాబు నుంచి కూడా కాదు. నిన్ను పుట్టించిన తాతల నుంచి కాదు. ఇక్కడ వైయస్ఆర్ సిపి మాత్రమే అధికారంలోకి వస్తుంది, వైసిపి ఎమ్మెల్యేలే గెలుస్తారు. జగన్ గారు ప్రజలకు ఎంత మంచి చేశారనే దానికి ఇది ఒక కొలబద్ద. నీకు ప్రజాకంఠకుడు అనే పేరు ఎప్పుడో ఉంది. ఇప్పుడు కొత్తగా మేం చెప్పాల్సిన పనిలేదు. నా అంతు నువ్వు చేడాల్సిన పనిలేదు. నీ అంతు చిత్తూరు జిల్లా ప్రజలే చూస్తారు.

*తన అసమర్థుడైన కొడుకును తలుచుకుని బాబు బాధపడుతున్నాడు

“జగన్ గారు తెలివైన వ్యక్తి, అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నా కొడుకు అసమర్థుడు, సుద్ద మొద్దు, లోకేష్ కు అన్ని తెలివితేటలు లేవు, జగన్ గారి లాంటి కొడుకు నాకు పుట్టలేదని” చంద్రబాబు బాధపడుతున్నాడు. జగన్ గారితో తన కొడుకును పోల్చుకుని మరింత బాధపడుతున్నాడు. ఇలా ప్రతి దానిని ఆలోచించుకుని ఉన్న అల్జీమర్స్ ను మరింత పెంచుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని చంద్రబాబును కోరుతున్నాను. రాష్ట్రప్రతితో, ప్రధానితో మాట్లాడుతానని అంటున్నాడు. రామోజీరావు, రాధాకృష్ణలతో మాట్లాడుతూ రాష్ట్రప్రతి, ప్రధానిలతో మాట్లాడానని అనుకుంటున్నాడేమో.

*

*చంద్రబాబును పర్మినెంట్ గా కుప్పం ప్రజలు ఇంటికి పంపించబోతున్నారు*

‘పెద్దిరెడ్డి పని అయిపోయింది. పుంగనూరులో నేను చూస్తాను’ అని చంద్రబాబు అంటున్నాడు. పుంగనూరులో నువ్వు నన్ను చూసేది ఏమిటీ? కుప్పంలోనే నీ పరిస్థితిని నేను చూస్తున్నాను. త్వరలోనే కుప్పంలో నీ జెండాను పీకేస్తావు. వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో అక్కడ వైయస్ఆర్ సిపి గెలుస్తుందనే విషయం నీకు తెలుసు. నీ జెండాను మోసే శక్తే నీకు లేదు. పవన్ కళ్యాణ్ ను పట్టుకుని మా జెండా మోయమని ఆయన చేతికిఇచ్చావు. మీలాగ కాదు జగన్ గారు స్వయంగా పార్టీని నడిపిస్తూ, కుప్పంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తూనే, ప్రజల ద్వారా నీ అంతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు. దాని ప్రకారం కుప్పం ప్రజలు కూడా వైయస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వడమే కాకుండా నిన్ను పర్మినెంట్ గా రాజకీయాల నుంచి ఇంటికి పంపించబోతున్నారు. దానికి చంద్రబాబు సిద్దంగా ఉండాలి.

*మైనార్టీలపై చంద్రబాబుకు ఇప్పుడు ప్రేమ పుట్టుకువచ్చిందా?

చంద్రబాబుకు ఉన్నట్టుండి మైనార్టీలు గుర్తుకు వచ్చారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నాడు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మైనార్టీలను మండల అధ్యక్షులను చేశాము. మైనార్టీ వ్యక్తిని జెడ్పీటిసిగా, సింగిల్ విండో అధ్యక్షుడిని చేశాము . జనరల్ సీట్లలో కూడా మైనార్టీలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగానే పుంగనూరు మున్సిపాలిటీని మైనార్టీలకు ఇచ్చాం. జగన్ గారు మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, తన ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదు. కానీ వైయస్ఆర్ సిపిలో మైనార్టీలకు పెద్దపీట వేయడమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు పెద్ద పీట వేయడం జగన్ గారి వల్లే జరిగింది. నువ్వు ఎప్పుడూ మైనార్టీలకు, ఎస్టీలకు అన్యాయం చేశావు. ఆరు నెలలకు ఒక సారి ఎస్సీలకు ఇచ్చిన మంత్రిపదవులను పీకేశావు. మా పార్టీలో అయిదుగురికి డిప్యూటీ సీఎంలను ఇచ్చారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఉన్నారు. ప్రతి కులాన్ని కూడా జగన్ గారు గౌరవిస్తున్నారు. దానిని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *