తెరాస కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్: మర్రి

తెరాసతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతున్నదని కాంగ్రెస్ మాజీ  మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.

ఈ రోజు ఆయన పార్టీకీ రాజీనామా సమర్పించాక మీడియా తో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని శశిధర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెరాసతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని, ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు.

*పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా పార్టీ ఇన్‌ఛార్జ్‌లు : ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చాం. అయినా ఆయన్ను ఆరేళ్ల పాటు కొనసాగించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలి. తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ వారు పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌లో డబ్బు ఇచ్చే వాళ్ల మాటే చెల్లుతుందని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *