మొన్న ఎగుమతులు, ఇపుడు నిషేధం, ఏందిది?

 

మొన్న ఎగుమతులు అన్నారు..నిన్న నిషేధం విధించారు..ఇదీ మోడీ సర్కార్ మాయాజాలం”

 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రియాక్షన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న నిలకడలేని విధానాలు, చర్యలవల్ల ప్రపంచ దేశాల ఎదుట భారతదేశం నవ్వులపాలు అయ్యేవిధంగా పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో నెల రోజుల క్రితం జరిగిన వర్చువల్ మీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, కానీ నెల రోజుల్లోనే ప్రపంచ దేశాలకు భారతదేశం నుంచి గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వినోద్ కుమార్ అన్నారు.

B Vinod Kumar (twitter picture)

దేశంలో రైతులు ఎంత పంట పండిస్తున్నారు..?, వ్యవసాయ ఉత్పత్తులు ఏ మేరకు వస్తున్నాయి..? వంటి అంశాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేదని వినోద్ కుమార్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకి అని, రైతుల పట్ల మోడీకి ఏ మాత్రం ప్రేమ, అభిమానం లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం అయిందని ఆయన అన్నారు.

వ్యవసాయం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు. రైతులను అన్ని రకాలుగా దగా చేయడమే నరేంద్ర మోడీ ఏకైక అజెండా అని వినోద్ కుమార్ విమర్శించారు.

భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 300 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుండగా, అందులో 50 శాతం దేశ ప్రజల అవసరాల కోసం, ఆహార భద్రత కోసం నిల్వలు ఉంచుకుని మిగతా ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాల్సిన కనీస బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందని వినోద్ కుమార్ అన్నారు.

ప్రపంచంలో 100 చిన్న దేశాలు తమ దేశాల అవసరాల కోసం ఆహార ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసు కుంటున్నాయని అన్నారు.

గోధుమలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య శాఖ అధికారుల బృందాన్ని మొరాకో, తునిసియ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా, లెబనాన్ వంటి దేశాలకు నిన్నగాక మొన్న పంపించారని, అంతలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గోధుమల ఎగుమతిపై నిషేధం విధించారని వినోద్ కుమార్ తెలిపారు.

ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ తెప్పించుకుని రానున్న రోజుల్లో దేశం నుంచి ఫుడ్ గ్రైన్స్ ఎగుమతులు చేయాలని వినోద్ కుమార్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *