15 నుండి పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 30

మే 15 నుండి 17వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 15 నుండి 17వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 14వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 15 నుండి 17వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 16న అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *