TRS సభలో కెసిఆర్ విసిరిన 8 బాణాలు

టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు చెబుతూ ప్రసంగించారు.  ఆయన ముఖ్యంగా కేంద్రం లో  బిజెపి నాయకత్వంలో ఉన్న   మోదీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఆయన బిజెపి మీద విసిరిన ఎనిమిది బాణాలు…

1. కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు. కుటిల బుద్ధితో కులగొట్టడం ఈజీ. కానీ నిలబెట్టడం కష్టం.అద్భుత‌మైన ఈ దేశంలో దుర్మార్గ‌మైన విధానాలు దేశ ఉనికినే ప్ర‌శ్నించే స్థాయికి పోతున్నాయి

2. హిజాబ్ అంశంతో కర్ణాటక అట్టుదుకుతుంది. దీనికి కారణం బిజెపియే.  ఎవరు ఏ మతమైన స్వీకరించవచ్చు.

3. విదేశాల్లో ఉన్న 13 కోట్ల భారతీయులను  ఆ దేశాలు వెళ్లగొడితే ఈ దేశం సాదుతుందా?

4. దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. సమసిపోయిన గాయాల పై కారం చల్లుతున్నారు

5. మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పిచ్చి కొట్లాటల చిచ్పుపెట్టి దేశాన్ని ఏమి చేద్దాం అనుకుంటున్నారు

6. కత్తులు- తుపాకులు పట్టుకొని ఊరేగింపులా?

7. మతం- కులం పేరుతో విద్వేషాలు పొడుచుకొని చావాలా?

8. దేశంలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *