చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

 

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ సమావేశం వైసీపీ వర్గ కలహాలతో రణరంగంగా మారింది. తమ వార్డుల్లో పనులు జరగడం లేదని అధికార వైసీపీకే చెందిన కౌన్సిలర్లు కొందరు పాలకవర్గాన్ని నిలదీశారు.దీనికి మరో వర్గానికి చెందిన కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం ప్రారంభమయ్యింది. ఒకరిపై ఒకరు బూతులతో తిట్టుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి చెప్పులతో కొట్టుకున్నారు.

తన వార్డులో పనులు జరగడం లేదని 13 వ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ బాషా నిలదీయడంతో గొడవ మొదలయింది. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఖాజా మోహీద్దీన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే వైసీపీకే చెందిన ప్రత్యర్థి వర్గం రెచ్చిపోయింది. దీనితో వైసీపీ సభ్యులు రెండు వర్గాలుగా ఊగిపోయారు. చెప్పులతో కొట్టుకున్నారు. సమావేశం హాల్‌లో నే కాకుండా బయటకొచ్చి కూడా గొడవ పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *