విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు అంకురార్ప‌ణ‌

 

విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంట‌ల‌కు అంకురార్ప‌ణతో మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఇందులో భాగంగా మార్చి 18వ తేదీన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *