పోలవరం సందర్శించనున్న కేంద్ర మంత్రి

 

నేడు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజుతో కలసి పరిశీలించనున్నారు.

10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో కేంద్ర మంత్రి మాట్లాడతారు.

తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడి నిర్వాసితులతో మాట్లాడతారు.

అనంతరం అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించి బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి కేంద్ర మంత్రి షెకావత్ ,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు మాట్లాడతారు.

జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు విజయవాడలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి నేతల తో భేటీ అవుతారు

పోలవరం మోదీ వరంగా బిజెపి రాష్ట్ర ప్రజలకు ఈకార్యక్రమం ద్వారా తెలియచేయనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *