తిరుపతి 892వ జన్మదిన వేడుకలు…

తిరుపతి : ఈ రోజు తిరుపతి పట్టణ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

1130 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీన తన 112 వ ఏట శ్రీ రామానుజా చార్యులు శ్రీ గోవింద రాజుల స్వామి విగ్రహ ప్రతిష్ఠ  తో పాటు ఆలయ వీధులకు శంకుస్థాపన చేసినట్టు  ఉన్న చారిత్రక  శాసనాల ఆధారాలను బట్టి ఈ ఉత్సవం నిర్వహించారు.

తిరుపతి జన్మదినాన్ని పురష్కరించుకుని మరింత ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుంది. కోట్లాది మందిచే జన్మదిన శుభాకాంక్షలు అందుకుంది.

మానవ వికాస వేదిక చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం  తిరుపతి 892 వ జన్మదిన వేడుకలు జరిగాయి.

జియ్యర్ స్వాములు ఇందులో పాల్గోన్నారు. వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాలతో ప్రదర్శన సాగింది. పౌరాణిక కళా బృందాలు కళా ప్రదర్శన నిర్వహించాయి.

భూమన నిర్వహించిన ఆధ్యాత్మిక శోభా యాత్రను.. దారి పొడవునా పచ్చ తోరణాలు కట్టి, కర్పూర హారతులు పడుతూ, పూజలు నిర్వహిస్తూ భక్త జనులు స్వాగతించారు.

తిరుపతి జన్మదినం
తిరుపతి జన్మదినం

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ప్రఖ్యాతులతో విరాజిల్లుతున్న నేటి తిరుపతిని 892 ఏళ్ల కిందట శ్రీ గోవిందరాజపురం గ్రామం పేరిట పునాది రాయి వేసి మరీ ఏర్పరిచిన శ్రీ రామానుజాచార్యులను స్మరించుకుని కార్యక్రమాన్ని భూమన చేపట్టారు.

స్థానిక శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో శోభా యాత్రను నిర్వహించారు

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ టీటీడీ కి అనుసంధానం చేస్తూ భవిష్యత్ లో ప్రపంచమంతటా తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహించేలా చర్యలు చేపడుతామని వెల్లడించారు.

భగవద్ శ్రీ రామానుజాచార్యులు వారి దివ్య హస్తలతో పునాది వేసి, 892 సంవత్సరాల కిందట శ్రీ గోవింద రాజపురంగా గ్రామం గా నేటి తిరుపతిని ఏర్పాటు చేశారన్నారని, ప్రపంచంలో మరే ఇతర నగరాలకూ పుట్టిన తేదీ అంటూ లేదని అన్నారు.

కాల గర్భంలో తిరుపతి జన్మదినపు తేదీ ప్రాముఖ్యతకు నోచుకోలేక పోయినా, ఇన్నేళ్ల తర్వాతైనా ఈ తరంలో తొలి సారి జన్మదిన వేడుకలు నిర్వహించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. భావితరాలు మున్ముందు
ఈ వేడుకలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్,
నగర కమిషనర్ పీఎస్ గిరీష, ఎస్పీ వెంకట అప్పుల నాయుడు, నగర అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *