గుడ్ బై, మేడమ్! సోనియాకు జగ్గారెడ్డి లేఖ

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో వచ్చిన వివాదాలతో పార్టీ నుంచి వెళ్లిపోతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

మూడు పేజీల నివేదన లేఖను ఆయన మీడియా కు విడుదల చేసారు. లేఖలో వ్యక్తం చేసిన

జగ్గారెడ్డి ఆవేదన ఇది:

పార్టీ వీడినా గాంధీ కుటుంబం పై గౌరవం తో ఉంట..

ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి నేను కాంగ్రెస్ గుంపులో ఉండను.

త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా

కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ చీఫ్ కావొచ్చు.

సొంత పార్టీలోనే కుట్రపూరితంగా వేరే పార్టీ కోవర్టుగా ముద్రవేస్తున్నారు.

Jagga reddy letter to sonia

పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ లో గతంలో పార్టీలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు.

కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తా.

పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి.

2017 లో ఎవ్వరు అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే ఎవ్వరు సభ పెట్టడానికి ముందుకు రాకుంటే నేను కోట్లు సభ నిర్వహించాను.

ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడింది.. పార్టీ కోసం కష్టపడింది నేనా కోవర్టుని… సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతల కోవర్టులు…?

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పేట్టకుంటే తాను మెదక్ జిల్లా నుండి అబ్యర్దిని పెట్టి…. కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపాను …పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు… ఎవరు కోవర్తులు…అబ్యర్దిని పెట్టినవాళ్ళ…? లేక పెట్టిన వాళ్ళ…?

ఇటీవల హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్ల ను మూడువేల ఓట్ల కు పరిమితం చేసిన వాళ్ళు కోవర్తులా….? నేనా…

గాంధీ కుటుంబం పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను.. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్ళు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్తులా .?
లేక నేనా…అధిష్టానం గుర్తించాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *