‘బిజెపి వాళ్లు ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు’

ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బంధు వారోత్సవాలలోతెలంగాణ  ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటూ ఉందని ఆర్థిక, ఆరోగ్య మంత్రి  హరీష రావు అన్నారు. ఎందుకంటే, వాళ్లు కేంద్రంలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు అని ఆయన ఈ రోజు  ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రైతుల వారోత్సవాలలో ప్రసంగిస్తూ ఆరోపించారు.

 

ఇపుడు 317 జీవోని రద్దు చేయమంటున్నారు. దేని కోసం చేయాలి; అని ఆయన ప్రశ్నించారు.
“కేంద్రంలో 15 లక్షల 69 వేల ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపడం లేదు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నదిమోదీ ప్రభుత్వం. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్ లో 2 లక్షలు మొత్తంగా  కేంద్రంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయరు. ఇక్కడ తెలంగాణలో 317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగారు ఆలోచిస్తున్నారు.  బిజెపి నేతలు మాత్రం అడ్డుపడుతున్నారు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు.”
 తెలంగాణలో రైతుల గురించి మాట్లాడుతూ జైకిసాన్ నినాదం తెలంగాణలో అక్షరాల నిజమయిందని అన్నారు.
“జై కిసాన్ బీజేపికి నినాదం. అది తెలంగాణలో నిజం.రైతుకు ఓనాడు అప్పు పుట్టేది కాదు. పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి. కుల, మతాలకు అతీతంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు 50 వేల కోట్లు సాయం చేశారు.దేశంలో ఇలా సాయం చేసిన తొలి సీఎం కేసీఆర్ గారు మాత్రమే. ఇప్పటి వరకు ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేశాయి. కాని రైతుకే పన్ను కట్టింది మాత్రం సీఎం కేసీఆర్ గారు,” అని హరీష్ రావు అన్నారు.
తెలంగాణలో రైతు బంధు సంబురాలు
తెలంగాణలో రైతు బంధు సంబురాలు
ఆయన ఇంకా ఏమన్నారంటే…
భూమి శిస్తు, నీటి తీరువా, కరెంటు బిల్లు , బ్యాంకు రుణాలకు వ డ్డీలు వసూలు చేసే ప్రభుత్వాలు ఉండేవి.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలు పెంచి వ్యవసాయం భారం చేసింది.
వ్యవసాయ ఖర్చుల పెంచి రైతులపై భారం వేసింది బీజేపీ. రైతులకు ఖర్చులకు డబ్బులు ఇచ్చి భారం తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వం
రైతులు ఆదుకోమని వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ గారు మీ రాష్ట్రంలో పిట్టల్లా కాల్చిన చంపి రైతు హంతకుడిగా పేరు పొందావు. రైతు బాంధువుడు కేసీఆర్ .
నీ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు ఉందా..
మీరా మాట్లేడేది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద దేశంలో అతి ఎక్కువ ఖర్చు పె ట్టిన రాష్ట్రం తెలంగాణ.
వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏడేళ్లలో రెండు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
మీరు మీ రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ల ద్వారా నీళ్లు ఇచ్చారా, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారా…
పండిన పంట కొనమంటే చేతులు ఎత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం.
చాలా ప్రధానమంత్రులు ఉన్నారు. నెహ్రూ, ఇందిర, వా జ్ పాయ్ ఉన్నా రైతుల నుంచి పంటలు కొన్నారు. కాని బీజేపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.
రాష్ట్ర పరిధిలో మేం చేయాల్సిందంతా చేశాం. కాని మీ పరిధిలో ఉన్న పంట కొనుగోలు పై మీరు మాత్రం చేతులెత్తేశారు.
రోజుకో ముఖ్యమంత్రి బీజేపీ వాళ్లు ఇక్కడకు వ చ్చి మాట్లాడుతున్నారు. దమ్ముంటే మా రాష్ట్రంతో అభివృద్ధితో పోటీ పడండి, రైతు సంక్షేమంలో పోటి పడండి.
రైతులకు రైతు బందు సాయం చేయండి, ఉచిత విద్యుత్ ఇవ్వండి. మీరు మా రాష్ట్రానికి అసలు ఎం చేశారు.
ఏడు మండలాలు లాక్కున్నారు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు.
317 జీవో రద్దు చేయమంటున్నారు. దే ని కోసం చేయాలి.
కేంద్రంలో 15 లక్షల 69 వేల ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపడం లేదు. నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది.
రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్ లో 2 లక్షలు, కేంద్రంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయరు.
317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగారు ఆలోచిస్తుంటే, బిజెపి నేతలు అడ్డుపడుతున్నారు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు.
తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ గారు అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.
రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది. తెలంగాణ వాళ్లకు,తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలన్నారు. ఆనాడు రాజ్ నాథ్ సింగ్ అలా ఇవ్వడం సాధ్యం కాదన్నారు.
రాష్ట్రాలు విభజన గతంలో చేసినట్లు చేస్తాం. తప్ప స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వం అన్నరు. అయినా సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్నదేంటి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు.
భారత రాష్ట్ర పతి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారో… అదే జీవోను మేం అమలు చేస్తున్నాం. రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయవద్దంటున్నారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ మాట్లాడుతోంది.
ఆ పార్టీకి ప్రజలపైన, నిరుద్యోగులపై ప్రేమ లేదు.
ఏడేళ్లలో లక్షా 39 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఏ బీజేపీ రాష్ట్రం కూడా ఉద్యోగులకు ఇంత జీతాలు ఇవ్వలేదు.
కరోనా కష్టకాలంలో పీఆర్సీ 30 శాతం ఇచ్చిన ప్రభుత్వం మాది. కేంద్ర ప్రభుత్వం ఏడున్నర శాతం ఇచ్చారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకన్నా తక్కువ ఇచ్చింది.
ఎక్కడైనా సమస్యలు ఉంటే ఉద్యోగ సంఘాలతో, ఉపాధ్యా సంఘాలతో మాట్లాడి పరిష్కరిస్తాం. బీజేపీది రాద్ధాంతం, బీజేపీది కుట్ర.స్థానికులకు ఉద్యోగాలు దొరకవద్దు అన్న కుటిల నీతి.
బీజేపీ మాటలు కేవలం గోబెల్స్ ప్రచారం.
పది వేల రైతు బంధు దేశం అంతా ఎందుకు ఇవ్వరు మీకు రైతులపై ప్రేమ ఉంటే
మేం ఉద్యోగులకు ఇచ్చినట్లు 30 శాతం ఫిట్మెంట్ మీరు దేశ మంతా ఇవ్వండి.
అత్యధిక శాతం రైతుల కోసం ఖర్చు చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ.
జై జవాన్, జైకిసాన్ అన్న నినాదం ఉండేది. జై జవాన్, నై కిసాన్ గా మార్చింది బీజేపి ప్రభుత్వం.
రైతులంటే చిన్నచూపు బీజేపికి, రైతులకు బాయి కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోంది బీజేపీ ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *