TTDలో 15 యేండ్లుగా కాంట్రాక్ట్ కార్మికులా?

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) అనేది ధార్మిక సంస్థ. ఈ  సంస్థలో 15 సంవత్సరాలుగా కొంతమంది కార్మికులు కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ల సమస్యకు ధార్మిక సంస్థ వద్ద పరిష్కారం లేక పోయింది. కార్మికులు ఇపుడు ఆందోళన చేస్తున్నారు. వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కందాళ  మురళి చేసిన ప్రకటన ఇది.
***
తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయమని కోరుతూ శాంతియుతంగా, గోవింద నామస్మరణ చేస్తూ టిటిడి పరిపాలనా భవనం వద్ద గత 14 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న విషయం విదితమే.
గురువారం నాటి సాయంత్రం ఈవో జవహర్ రెడ్డి గారు చర్చల పేరుతో కార్మికులను పిలిపించుకుని బెదిరింపులకు దిగారు. కాంట్రాక్టు వ్యవస్థలో లోపాలు, సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని కొనసాగించాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టిటిడి అధికారులు, పోలీసులను ఉసిగొల్పి అర్ధరాత్రి సిఐటియు నాయకులు  నాతోపాటు , నాగరాజు, జయచంద్ర, సాయి లక్ష్మి లను గృహనిర్బంధం గావించారు.
TTD Contract workers
టిటిడి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
శుక్రవారం నాటి ఉదయం ఆరున్నర గంటల కల్లా టిటిడి పరిపాలనా భవనం వద్ద ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల నిరసన దీక్ష శిబిరానికి వందలాది మంది పోలీసులు వెళ్లి కార్మికులను చెల్లాచెదురు చేసి, నాయకుల్ని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు.

టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు
1.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు టైం స్కేల్ అమలు చేయాలి.
2.వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి .
3.టిటిడి ఏర్పాటుచేసిన కార్పొరేషన్లో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎఫ్ ఎం ఎస్ కార్మికులను విలీనం చేయాలి.
4. కాంట్రాక్టర్ల దోపిడీని అరాచకాలను అరికట్టాలి.

TTD Contract Workers
టిటిడి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
ధార్మిక సంస్థ టీటీడీలో అధర్మాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న సిఐటియు నేతలు టి. సుబ్రమణ్యం, ఆర్. లక్ష్మీ, చిన్నా, మల్లికార్జున్ రావు లతోపాటు మద్దతుగా వచ్చిన జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ గారిని, కాంట్రాక్ట్ కార్మికులను అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది.
సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం… సమస్యలు చెప్పుకున్న పేదలపై నిర్బంధాన్ని ప్రయోగించడం, వారి గొంతు పై కత్తి పెట్టడం ఎంతవరకు సమంజసం. తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరుతున్నాము.
టిటిడి లాంటి ధార్మిక సంస్థలో కాంట్రాక్టు వ్యవస్థ ఏమిటి? 11వ తేదీన తిరుమల కొండపై జరపతలపెట్టిన టిటిడి బోర్డు సమావేశం లోనైనా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చర్చించి పరిష్కారానికి తోడ్పడాలి.  కమిషన్ల దందాలను లేకుండా చేయాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నది.
(కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *