రావత్ కు మంగళగిరి వాకర్స్ నివాళి

భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ కు ది మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఘన నివాళులు అర్పించింది. శుక్రవారం ఉదయం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇతర వాకర్స్ పెద్ద సంఖ్యలో మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ వద్ద గల ఎకో హిల్ పార్కులో సంతాప ర్యాలీ నిర్వహించారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి లాన్స్ నాయక్ బి.సాయితేజ సహా 13 మందికి వాకర్స్ శ్రద్ధాంజలి ఘటించారు.
ర్యాలీ అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, కోశాధికారి గోలి బాలమోహన్ రావు, సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి వీరులకు వందనాలు సమర్పించారు. దేశానికి అందించిన సేవలు నిరుపమానమని శ్లాఘించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *