టిడిపి ‘చర్చ’ ను తిరస్కరించిన స్పీకర్

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు,
ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా

 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్‌ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. అయితే, ధరల మీద టిడిపి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు

ఇటీవల మరణించిన మాజీలు  ఎంఎ అజీజ్‌,  రామిరెడ్డి, ముమ్మిడివరం  కృష్ణమూర్తి మృతి, రంగనాయకులు,  టీ.వెంకయ్య,  వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *