అమరావతి పాదయాత్రలో శివపూజ

అమరావతి: న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పరిరక్షణ సమితి,రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని వారధి శివాలయంలో మహిళా జేఏసీ నేతలు ప్రత్యేకపూజలు  నిర్వహించారు.
కార్తీకమాసం తొలిసోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్:
*ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించాలి,ముఖ్య మంత్రి జగన్ కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలి.
*అమరావతి పరిరక్షణ సమితి,రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రభుత్వం,పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు
*రైతుల పాదయాత్రపై రాళ్లు,రువ్వుతారని సజ్జల అన్నారు…రాళ్లు వేయడం కాదు..ప్రజలు పూలతో స్వాగతం పలుకుతున్నారు
*ఆంధ్రప్రదేశ్ భవిష్యత్,అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉంది
*పోలీసులు అక్రమ కేసులు బనాయించినా,అవమానాలు ఎదురైనా రాష్ట్రభవిష్యత్ కోసం భరించాం
*రైతుల త్యాగాలు వృధాకారాదని,మహా పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిపించాలని శివయ్యను కోరుకున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *