జగన్ మీద చంద్రబాబు ఆగ్రహం

*అమరావతి రైతుల శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది
*అమరావతిని ఆపేసి క్షమించరాని తప్పు చేశారు, ఇపుడు రైతుల పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగలొద్దు
(చంద్రబాబు నాయుడు)
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోంది అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోదాలు కల్పిస్తోంది. పోలీసులను అడ్దుపెట్టుకుని ఉక్కుపాదం మోపుతోంది. కోర్టు అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య. పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదు. జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు అని నిన్న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారు. వారికి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? సీఎంకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అనగదొక్కుతున్నారు.ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తు ని అంధకారంలో కి నెట్టి క్షమిoచరాని తప్పు చేశారు. 5 కోట్ల మంది ఆకాంక్షలనుగుణంగా రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు.
 (చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, విడుదల చేసిన ప్రకటన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *