కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారు తన ప్రియ వాహనమైన గరుడ వాహనంపై ఆసీనులై భక్తులను ఆశీర్వదించారు.

కొవిడ్‌ కారణంగా ఆలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు స్వామివారిని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి భక్తి సాగరంలో పులకించారు.

గరుత్మంతుడు తన మాతృమూర్తిని దాస్యం నుంచి విముక్తి చేసిన వీరపుత్రుడు. జన్మనిచ్చిన తల్లి సేవ కోసం నిరంతరం శ్రమించిన గరుత్ముంతుడిని శ్రీమహావిష్ణువు తన అనుంగు వాహనంగా చేసుకున్నారు.

అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వీక్షణం అత్యంత పవిత్రమని పురాణాలు చెబుతున్నాయి. అంతకముందు గరుడ సమేతుడైన మలయప్ప స్వామిని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు.

సంప్రదాయంలో భాగంగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *