శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్

 

తిరుమల ,అక్టోబరు 11 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం  రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆరున్నరకు తిరుమల బేడీ ఆంజనేయస్వామి ఆలయం చెరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి టిటిడి ఇవొ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి,జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,టిటిడి అదనపు ఈ ఓ ధర్మారెడ్డి,ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆంజనేయ స్వామి దర్శనం చేయించారు.

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదయాంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  శ్రీవారి దర్శించుకున్న ముఖ్యమంత్రి కి రంగనాయక మండపం నందు టిటిడి డైరీ,క్యాలెండర్ ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు ల‌క్ష‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

తర్వాత, ఆలయ అర్చకులు వేదమంత్రాల తో అశ్వరచనం చేశారు,టిటిడి ఇవొ చైర్మన్ ముఖ్యమంత్రి కి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రం పటంను అందజేశారు. అనంతరం శ్రీవారి గరుడ సేవలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చెర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యూలు వెల్లంపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్న బాబు,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) రాజంపేట తిరుపతి,చిత్తూరు ఎంపి లు, పి.వి.మిథున్ రెడ్డి, ఎం. గురుమూర్తి, యన్. రెడ్డెప్ప, జెడ్ పి చైర్మన్ జి. శ్రీనివాసులు, తిరుపతి, సత్యవేడు, పలమనేరు, పీలేరు, నగరి,చిత్తూరు ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి, ఆదిమూలం, వెంకటే గౌడ, చింతల రామచంద్రారెడ్డి,ఆర్ కె.రోజా,అరిణి శ్రీనివాసులు, ఎం ఎల్ సి లు బి. కిశోర్ బాబు,
డి ఐ జి క్రాంతి రాణా టాటా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు,టిటిడి బోర్డు సభ్యులు తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *