రాగల 3 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు

భారత వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో  తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది.

ఈ రోజు రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆదివారం అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్-ఒడిశా- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వెేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

 

రాగల 3 రోజుల వాతావరణ సమాచారం:

*శనివారం(25-09-2021):

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా ,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

*ఆదివారం(26-09-2021):

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

*సోమవారం(27-09-2021):

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *