బండి యాత్రలో ఎక్కడ చూసినా జనం, నర్మాలలో ఘన స్వాగతం

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామయాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామానికి చేరుకుంది.

అక్కడ  మహిళలు, కార్యకర్తలు ఆయన ఘన స్వాగతం పలికారు.  పాదయాత్రలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ వెంట కదిలారు.  అక్కడ కూడా అన్ని చోెట్ల లాగే ప్రజలు తమ సమస్యలు నివేదించారు. పెద్ద ఎత్తున జనం తరలిరావడం విశేషం. సంజయ్ యాత్ర  మొదలయినప్పటినుంచి స్పందన విపరీతంగా ఉంది. టిఆర్ ఎస్ కు బలమయిన కేంద్రాలయిన నియోజకవర్గాలలో జిల్లాలలో కూడా ప్రజలు పెద్ద ఎత్తన తరలివస్తున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా టిఆర్ ఎస్ కు పెట్టని కోట. ఈ జిల్లాలో కూడా బండి సంజయ్ యాత్రకు విపరీతంగా స్పందన వచ్చింది.

 

కామారెడ్డి జిల్లా ఘనపూర్ శివారు నుంచి ఈ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *