నిజాం లోంగిపోయాక ఏం జరిగింది?, దాన్నెవరు రికార్డు చేశారు?

(దివి కుమార్)

గత కొద్ది సంవత్సరాలుగా సెప్టెంబరు నెల రాగానే భారతీయ జనతాపార్టీ నాయకులు తామే తెలంగాణా విమోచనకారులమన్నట్టు డబ్బాలు కొట్టుకుంటూ, ఇతరులపైన బురద చల్లుతున్నారు. రాజ్య సిద్ధాంతవు పరిభాషలో నాటి ఢిల్లీ పాలకులకెంత స్వాతంత్య్రం వుందో నిజాం నవాబుకీ అంతే వుందన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. 1947 ఆగస్టు15తో కాంగ్రెసు వారికి భారతదేశాన్నీ, పాకిస్తాన్ని ముస్లింలీగుకూ బదలా యించి బ్రిటిషువారు ప్రత్యక్ష అధికారం నుండి తప్పకున్నారు.

అలాగే సంస్థానాథీశులకు కూడా స్వాతంత్య్రం యిచ్చేశారు. ఆ మేరకు 1948 సెప్టెంబరు 17 దాకా నిజాం రాజ్యం అప్పటికి 150 సంవత్సరాల క్రితం కోల్పోయిన “స్వాతంత్య్రాన్ని” తిరిగి పొందింది. నిజాం రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్లో విలీనం చెయ్యటాన్నే, అందుకై నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వం 50వేల మిలట్రీని పంపి కూడా దానికి “పోలీసుయాక్షన్‌” అని పేరిడటాన్నే, నైజాం నవాబు సర్దార్‌ పటేల్‌ ముందు లొంగి పోవటాన్నే తెలంగాణా విమోచనంగా కొందరు చెబుతున్నారు.

అప్పటికి ౩౦ నంవత్సరాలుగానిజాం నిరంకుశ వ్యూడల్‌ పరిపాలనకు వ్యతిరేకంగా సాంస్కృతిక రూపాలలో నిరసన ప్రారంభమైవుoది. దున్నేవానికే భూమి – విశాలాంధ్రలో ప్రజారాజ్యం గా 1946 నాటికి ఆంధ్ర మహాసభ విస్పష్టమైన లక్ష్యాలను సంతరించుకుంది. నిజాం పాలనకు బొడ్రాయి వంటి దొరలు, దేశముఖులకు వ్యతిరేకంగా, వారి సైన్యాలు, రజాకార్లకు వ్యతిరేకంగా రెండు సంవత్సరాలుగా పోరాడుతూ సుమారు 3000 గ్రామాల్లో నిజాం పాలనకు స్థానం లేకుండా చేశారు. 10 లక్షల ఎకరాల భూముల్ని దొరల నుండి గుంజుకుని రైతాంగానికి పంపిణీ చేశారు.

భూమి, భుక్తి, విముక్తికోసం సాగుతున్న ఈ రైతాంగ పోరాట వెల్లువను బలహీన యంత్రాంగంగల నిజాం ప్రభువు అదుపు చేయలేడు. ఏమాత్రం ఆలస్యం జరిగిన నిజాం రాజ్యం మరో ఏనాన్‌ అవుతుంది. నాటి ప్రపంచ పరిస్థితుల్లో విముక్త తెలంగాణా ప్రభావం దోపిడీ శక్తుల గుండెలపై లావా అవుతుంది.

ఇది తెలిసిన లండన్‌, ఢిల్లీలోని తెల్ల, నల్లదొరలు వేగంగా పావులు కదిపి, మిలటరీ నడిపి ఆక్రమించుకున్నట్టే ఆక్రమించుకోగా, నిజాం ప్రభువు లొంగినట్టే లొంగాడు. ఈ కుట్రపూరిత నాటకం, భారత ప్రజలకు అర్థంకాకుండా నిజాం రాజ్యం మరో పాకిస్థాన్‌ అయ్యేది అని భయోత్పాతాన్ని సృష్టించారు.

నిజాం రాజ్యం ఇండియన్‌ యూనియన్లో విలీనమైన తర్వాత, (పారిపోయిన) దొరలు రూమీ టోపీలు వదిలి ఖద్దరు టోపీలతో, రజాకార్లకు బదులు భారత మిలట్రీ బలగాలతో గ్రామాలలో ప్రవేశించి తిరిగి భూముల్ని గుంజుకునే ప్రయత్నం చేశారు. నిజాం వ్యతిరేకపోరాట కాలంలో పొందిన విజయాలను రక్షించుకోవటానికి ఇంకో మూడు సంవత్సరాలపాటు సాయుధ పోరాటాన్ని రైతాంగం కొనసాగించారు. మొత్తం 4000 మంది ఈ పోరాటంలో అమరులైనారు. ఇదీ తెలంగాణా, పీడిత ప్రజల వీరోచిత చరిత్ర. భారత విప్లవానికీ, భూమి సమన్యకూ గల విడదీయలేని సంబంధాన్ని ఎలుగెత్తి చాటి, వేగుచుక్కై నిలిచిన ఉజ్జ్వల పోరాట జ్వాల ఇది!

(సాహిత్యం కళల్లో తెలంగాణ విమోచన పోరాటం-1)

ఈ చరిత్రను సాహిత్య- సాంస్కృతిక రంగాలు విస్తారంగా నమోదు చేశాయి.
ముస్లిం రైతుయువకుడు బందగీ సమాధికి నివాళినర్పిస్తూ , సుంకర-వాసిరెడ్డిల మాభూమి నాటకం, 1942 నాటి ఒక వాస్తవిక సంఘటనతో ప్రారంభమౌతుంది. ఉద్యమం దేశముఖుల, పటేలు, పట్వారీల వారి గుండాలకు వ్యతిరేకంగా వెల్లువలా పొంగింది. సాయుధంగా తప్ప హక్కులు సాధించుకోలేమనే స్థితిదాకా ఎదిగి దున్నేవానికే భూమి సాధనకై అమరవీరుల ఆశయ సాధనకై శపథం చేయటంతో మాభూమి నాటకం ముగుస్తుంది.

ఈ నాటకాన్ని పోలీసు యాక్షన్‌ పేరిట జరిగిన మిలటరీ యాక్షన్ కు ముందే మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణా ప్రాంత ప్రజల న్యాయబద్ధ పోరాటానికి, ప్రజాస్వామిక ఆకాంక్షలకు అప్పటికి వేరే రాష్ట్రంగా వుండిన తెలుగు ప్రజానీకంలో రెండు సంవత్సరాల కాలంలో 920కి పైగా ప్రదర్శనలిచ్చి (రోజుకొకటి కంటె ఎక్కువ) సంఘీభావాన్ని పెంపొందించటంలో చారిత్రాత్మక పాత్రను ఈనాటకం నిర్వహించింది.

ఈ నాటకాన్ని ప్రశంసించని ప్రముఖుడే ఆనాడు లేడంటే ఆశ్చర్యంకాదు. ప్రతిభావంతమైన వాస్తవిక జీవిత చిత్రణ ద్వారా పోరాట ఆవశ్యకతను, అనివార్యతను ఆమోదింపజేయటంలోనే ఈ నాటకం యొక్క విజయం దాగి వుంది. రచయితలు సుంకర, వాసిరెడ్డి, డా॥ గరికపాటి రాజారావు వంటి దర్శకులు గొప్ప కళాత్మక చిత్రణ ద్వారా దాన్ని సాధించారు.

జీవిత వాస్తవాన్ని నిరాకరించలేక, పోరాట సత్యాన్ని ఆమోదించలేక, తమలోని స్వతంత్ర, ప్రజాస్వామిక డొల్లతనాన్ని అప్పటికే బయట పెట్టుకుంటూ కాంగ్రెస్ పాలకులు ‘మాభూమి’ ని నిషేధించారు. ఆనాటికే నిజాం రాజ్యంలో బుర్రకథ అనే కళా రూపమే నిషేధానికి గురయివున్నది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఏ కథ చెప్పినా వంతలు పేరుతోనో మరొకరకంగానో ఆనాటి పాలకుల దోపిడీ దౌర్జన్యాలను బుర్రకథ కళాకారులు బహిర్గత పరుస్తున్నారనే అనుమానంతో ఏకoగా కళారూపాన్నే నిషేధించిన కాలమది.

 


మాభూమి రచయిత సుంకర ఆనాడే వ్రాసిన వీరకుంకుమ నాటికలో నిజాం నవాబు, రజాకార్లు ముస్లిములయినా, దేశముఖ్‌- పట్వారీ – వారి గూండాలు హిందువులయినా, వారి మధ్య గల సయోధ్యకు, వ్యూడల్‌ ఆర్థిక- రాజకీయాల భూమిక మూల కారణమని ప్రేక్షకులకు సులువుగా అర్ధ్థమయే రీతిలో అత్యంత స్పష్టంగా దృశ్యీకరించారు.


 

ప్రజావ్యతిరేక పాత్రలతో నడిచే ఈ నాటకంలో ఒక రజాకారు, మరొక హిందూ గూండా పాత్రలు వున్నా వారి క్రౌర్యం పట్ల ప్రజలలో రగుల్కొనే ఆగ్రహం, వారు పుట్టిన మతంపై ద్వేషంగా మరలకుండా సూత్రబద్ద లౌకికతత్వానికి కట్టుబడి నాటిక నడిపించారు. ప్రజా దృక్పధానికి నమూనాగా నిలిచిన గొప్ట కళా ప్రదర్శనలివి.

1946-51 మధ్యకాలంలో కవులు, కథకులు, నవలాకారులు, నాటకకర్తలు ఆటలు పాటల జానపదకళా ప్రదర్శకులు, చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు… పత్రికలు ఇలా అనేక రూపాలలో, బహుముఖంగా ఎందరో ఈ పోరాటాన్ని తమ తమ సృజనాత్మక రూపాలలో నమోదు చేశారు. దాశరథి, అగ్నివీణ కాళోజీ నాగొడవ కవితలు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎక్కుబెట్టినవి. ‘మాభూమి’ నాటకం లాగానే మరి కొన్ని నిషేధానికి గురైనాయి. వజ్రాయుధం (సోమసుందర్‌), కావ్యం, సింహగర్జన (లక్షీకాంతమోహన్‌), నవల, గంగినేని వెంకటేశ్వరరావు రాసిన ఎర్రజెండాలు ఇందులో ముఖ్యమైనవి. పోరాట కాలంలోనే వెలువడిన నవలలు బొల్లిముంత శివరామకృష్ణ రాసిన మృత్యుంజయులు’. లక్ష్మీకాంతమోహన్‌ ‘సింహగర్హన’ ( ఇంగ్లీషులో) Telangana Thunders పేరుతో వచ్చింది.

ఇంకా వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజలమనిషి, గంగు మహీధర రామ్మోహనరావు ఓనమాలు, మృత్యువునీడల్లో ‘, గొల్లవూడి నారాయణరావు రావు మూడు నవలలు పాతరోజులు-కొత్తరోజులు- తెలుగుగడ్డ- దాశరథి రంగాచార్య చిల్లరదేవుళ్ళు, జనపదం (మూడుభాగాలు) సరిపల్లె కృష్ణారెడ్డి ఉప్పెన, 9 పోరాటకాలమంతా దళాల మధ్యనే వుండి సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిoచిన తిరునగరి రామాంజ నేయులు రాసిన *సంగం మొదలైన నవలలూ — ఆనాటి పోరాటo నడి మధ్యన జీవంచినవారూ, సమకాలికులూ రాసినవి. ప్రఖ్యాత హిందీ-ఉర్దూ రచయిత కిషన్‌ చందర్‌ రాసిన నవల జబ్‌ ఖేత్‌ జాగే తెలుగులో జైత్రయాత్రగా అనువాదమై బి.నరసింగరావు తీసిన మాభూమి సినిమాకు ఆధారమైంది.

రెండో భాగం ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/telangana-struggle-1857-war-of-independence/

ఈనాటికీ వీర తెలంగాణా విప్లవ పోరాటంపైన సృజనాత్మక నవలా సాహిత్యం వెలువడుతూనే వుంది. సింగరేణి బొగ్గుగని కార్మిక నాయకుడు అమరుడు కామ్రేడ్‌ శేషగిరిరావు జీవిత చరిత్రను ఈతరం బొగ్గుగని కార్మికుడు పి.చంద్‌ శేషగిరి నవలగా రాశారు. అంపశయ్య నవీన్‌ రాసిన పోరాట పూర్వం, పోరాటకాలం, పోరాటానంతర (నక్సల్‌బరీ ఉద్యమ) జీవితాల్ని విస్తారంగా ప్రతిబింబించిన మూడు నవలలు ఇటీవల కాలంలో వెలువడ్డాయి.

విస్త్రత జీవితాన్ని చిత్రించటానికి సావకాశమున్న సాహిత్యరూపం నవల. అటువంటివి సుమారు 20 నవలలు ఇప్ప

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/telangan-armed-struggle-against-nizamt-telangana-liberation-day/