సిరిసిల్లలో వర్ష బీభత్సం, రంగంలోకి KTR

*మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని మునిసిపల్ మంత్రి  కేటీఆర్ ఆదేశించారు.

సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

ఈ విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరదలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.

సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు.

రానున్న 48 గంటల పాటు వర్షపాతం ఉన్నందున వరద మల్లింపుకు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు.

ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *