భారీ వర్షాలున్నయ్, మరో 3 రోజుల మరింత జాగ్రత్త!

 

లోతట్టు, మారుమూల ముంపు ప్రాంతాల్లో ముందస్తు పునరావాస చర్యలు చేపట్టాలి

ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణ, అస్తి నష్టాలు జరగకుండా చూడాలి

చెరువులు, కుంటలను పరిరక్షించాలి

గత అనుభవాలను గుణపాఠాలు గా స్వీకరించండి

భారీ, అతి భారీ వర్షాల సూచనలతో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి

ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీ లు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలి కాన్ఫరెన్స్

తెలంగాణ సహా, చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక చేశారు.

రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ బండ ప్రకాశ్, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, వరంగల్ CP, ఆయా జిల్లాల ఎస్పీ లు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు అప్రమత్తం చేవారు.

రాబోయే 24గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదన్నారు. అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు.

గత అనుభవాలను గుణపాఠాలు గా తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలను ముందుగానే పరిరక్షించే చర్యలు చేపట్టాలన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో వర్ష నష్ట నివారణకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని, భారీ వర్షంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలని అయన కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *