ఢిల్లీలో టిఆర్ ఎస్ కార్యాలయానికి భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర సమితికి తొందర్లో అట్టహాసంగా  దేశ రాజధానిలో కార్యాలయం రాబోెతున్నది. ఇది వస్తే శాశ్వత కార్యాలయం ఉన్న  ప్రాంతీయ పార్టీ టిఆర్ ఎస్సే అవుతుంది. టిఆర్ ఎస్ కార్యాలయం అత్యంత ఆధునికంగా నిర్మాణం కాబోతున్నదని పార్టీ వర్గాలుచెబుతున్నాయి. తెలంగాణ రిచెస్ట్ స్టేట్, టిఆర్ ఎస్ రిచెస్ట్ ప్రాంతీయ పార్టీ, టిఆర్ మోస్ట్ మాడరన్ కార్యాలయం అవుతుంది అని ఒక సీనియర్ నాయకుడు వర్ణించారు.

ఈ రోజు పార్టీ భవన నిర్మాణానికి  ముఖ్యమంత్రి కెసిఆర్ శంకు స్థాపన చేశారు.

 

పార్టీ ఏర్పడి  20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చెేపట్టారు.  దేశ రాజధానిలో  చాలా ప్రతిష్టాకరమయిన  వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు.  మధ్యాహ్నం 1.48 గంటలకు తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు రాష్ట్రమంత్రి  కేటీ రామారావుతో పాటు,పార్టీ సెక్రెటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు డా కేశవరావు, హోమ్ మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తదితర  మంత్రులు, శాసనసభ్యులు, ఇతర పార్టీ పెద్దలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *