ఆంధ్రాలో రోడ్లేవి? పవన్ రిపేర్ శ్రమదానం

విజయవాడ,: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రోడ్లను మరచి పోయిందని మాజీ అసెంబ్లీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

రోడ్ల మరమ్మతులు చేపట్టడమే లేదని దీనిపై పై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ కూడా అయిన నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైన రహదారులపై గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం నిర్వహిస్తామని వెల్లడించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2, 3, 4వ తేదీల్లో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘జేఎస్పీ ఫర్‌ ఏపీ’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను మనోహర్‌ ఆవిష్కరించారు. అక్టోబర్‌ నాటికి పరిస్థితి మారకపోతే శ్రమదానం ద్వారా తామే రోడ్లు వేసేందుకు ప్రయత్నిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *