వినాయక చవితికి ఎపి లో బ్యాంకులకు సెలవీయండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయకచవితి పర్వదినం అయిన సెప్టెంబర్ 10న  బ్యాంకులకు  సెలవు ప్రకటించలేదు. దీని మీద అసంతృప్తి వ్యక్త మవుతూ ఉంది.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్‌ రాంబాబు ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఎపి ప్రభుత్వం  సెప్టెంబర్ 2021 న వినాయక చవితికి సెలవు ప్రకటించలేదని చెబుతూ ఈ పండగ  ఒక పెద్ద పర్వదినం అని ఇందులో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆయనకోరారు.

” మతాల అడ్డంకులు దాటి పౌరులందరూ ఈ ముఖ్యమైన పండుగను జరుపుకుంటారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ (NI) చట్టం కింద కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సెలవు ఇవ్వబడింది.నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్  కింద సెలవు కూడా ఉంది.అందువల్ల, వేలాది మంది బ్యాంక్ ఉద్యోగుల యొక్క మతపరమైన భావాలను గౌరవించాలి సెప్టెంబరు 10వ తేదీన వినాయక చవితికి సెలవు ప్రకటించాలి రాష్ట్రంలో పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం,’ అయన విజ్ఞప్తి చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *