దళితబంధు సభనే కేసీఆర్ చివరి ఉపన్యాసం : రేవంత్

 

* హుజురాబాద్ ఉపఎన్నికల వచ్చిన్నప్పటి నుంచి కేసీఆర్ కొంగజేపం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్తనించారు. ఈ రోజు ఆయన  దళిత బంధు అంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న హంగామా గురించి మాట్లాడారు.

రేవంత్ వ్యాఖ్యలు

* ఉద్యమంలో దళితులను ఉపయోగించుకొని ఒక పాచిక లాగా వాడుకున్నారు.

* ఏడున్నర ఏండ్లలో కేసీఆర్ అంబెడ్కర్- జగ్జీవన్ జయంతి- వర్ధంతి నివహించలేదు.

* నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విదంగా అంబెడ్కర్ విగ్రహం పెడుతా అని ఇప్పటికీ తత్తమట్టి తియ్యలేదు.

* మూడెకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతా అని మాట తప్పారు.

* దళితుల అభివృద్ధి కోసం ఒక్క సమీక్ష కూడా ముఖ్యమంత్రి చెయ్యలేదు.

* ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్- లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు.

* ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిని థర్డ్ డిగ్రీ- మరియమ్మ ను చంపిన చరిత్ర టీఆరెస్ ప్రభుత్వానిది.

* దళితులకు అన్యాయం చేసిన వాళ్లలో మొదటి దోషి- ముద్దాయి ముఖ్యమంత్రి కేసీఆర్.

* అంబేద్కర్- బాబు జగ్జీవన్ ను- దళితులను కేసీఆర్ ఇన్నేళ్లు అవమానించారు.

* దళితబంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారు!.

* అబద్ధాల పునాదుల మీద బీటలు పారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.

* అంబెడ్కర్ పేరుమీద పెట్టిన ప్రాణహిత చేవెళ్ల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడారా?

* ప్రాణహిత చేవెళ్ల లోపాల గురించి- ప్రాజెక్టు రిడిజైన్ గురించి కేసీఆర్ ఉద్యమంలో ఏనాడైనా ఉద్యమంలో ప్రశ్నించారా?

* తెలంగాణ ఉద్యమంలో మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ గురించి ఎందుకు మాట్లాడలేదు?

* రాష్ట్రంలోని చాలా గూడాల్లో నీళ్లపైపు కనేషన్స్ ఇంకా రాలేదు.

* మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆరెస్ ది.

* చెరువుల్లో మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు టీఆరెస్ నాయకులు సంపాదించారు.

*మిషన్ కాకతీయ పై నిజనిర్ధారణ కమిటీ వెయ్యాలి*

*కాళేశ్వరం ప్రాజెక్టు- మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ ప్రాజెక్టులు ప్రజల కోసం కాదు- ప్రజాధనం దోచుకోవడానికి!*

* ఏడేళ్ల కాలంలో దళితులకు- గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదు.

* ఒక్క శాసనసభ గెలవడానికి కేసీఆర్ నిచానికి దిగజారారు.

* హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి సొబమ్మను తెరమీదకు తెచ్చారు.

* కేసీఆర్ తన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మని ముందు వేస్తున్నారు.

* కేసీఆర్ ఈరోజు నుంచి సచ్చినపాము లెక్క!.

* దళితబంధు సభలో కేసీఆర్ మాటలు వింటుంటే జాలి కలిగింది.

* కేసీఆర్ నీచమైన రాజకీయాలకు శోభమ్మకు సంబంధం లేదు.

* ఒక్క ఎన్నిక కోసం శోభమ్మని చర్చలోకి లాగడం కేసీఆర్ స్థాయికి తగదు.

* దళితుల కోసం ఉన్న 4వేలకు పైగా ఉన్న సింగిల్ టీచర్ స్కూల్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మూసివేయించారు!.

* ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత- గిరిజనులు విద్యకు దూరం అయ్యారు.

* ఉద్యోగాలు టైంకు ఇస్తే ఏడేళ్లలో 60వేల గౌట్ ఉద్యోగాలు దళిత- గిరిజనులకు వచ్చేవి.

* 9లక్షల 50వేల మంది కార్పొరేషనళ్లలో దరఖాస్తులు పెట్టుకుంటే ప్రభుత్వం పక్కన పెట్టింది.

*శాసనసభ సమావేశాలు వెంటనే నిర్వహించాలి.*

*30లక్షల మందికి- ప్రతి కుటుంబానికి 10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వు.*

*దళితబంధు పై శాసనసభలో ఒకరోజు చర్చ జరపి- తీర్మానం చెయ్యాలి.*

*ఆరు నెలల లోపు ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు ఇస్తా అంటే మేము ఎక్కడైనా సంతకాలు పెడుతాం.*

* కేసీఆర్ ను త్వరలో బంజరు దోడ్ల తోలేరోజులు త్వరలో రాబోతున్నాయి.

* హుజురాబాద్ లో తుపాన్ రాబోతోంది- ఆ తుపాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారు.

* హుజురాబాద్ దళితసభ కేసీఆర్ మాటల్లో పిరికితనం కనిపిస్తోంది.

* అల్కామీర్ మండిలో ఉన్నట్లు దళితబంధు సభలో టీఆరెస్ నేతలు కనిపించారు.

* పదవులు గడ్డిపోషతో సమానం అన్న కేసీఆర్ ఎందుకు భయంతో ఉన్నారు.

* దళితులను మోసం చేస్తున్నందుకు కేసీఆర్ ఇంటిముందు చావు డప్పు మోగిస్తాం.

* ఇబ్రహీంపట్నం పట్నం సభ తరువాత- హుజురాబాద్ పై దండయెత్తుతాం- రేవంత్.

* రాజకీయంగా కేసీఆర్ దళితబంధు సభనే చివరి ఉపన్యాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *