నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా   వేగంగా వస్తున్న రెండు  కార్లు  ఢీ  కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 8 మంది ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు సమాచారం అందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కింది వీడియో చూడండి.

 

హైదరాబాద్‌ – శ్రీశైలం రహదారిపై అచ్చంపేట మండలం చెన్నారం గేట్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల వివరాలు అందాల్సి ఉంది.

క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అచ్చంపేట హాస్పిటల్ కి తరలించారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి, సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *