తిరుపతి గోవిందరాజస్వామి జ్యేష్టాభిషేకం ప్రారంభం

తిరుపతి, 2021 జూలై 19: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమ‌వారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌డ‌తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *