“వైఎస్సార్ పిల్లలకు దోచుకోవడం, దాచుకోవడం తెలీదు. పంచడమే పని”

‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురి అయిన వైఎస్సార్ భార్య విజయమ్మ

ఈ రోజు హైదరాబాద్ లో ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ ఆవిర్భవించింది. తెలంగాణలో వైఎస్ ఆర్ పేరు మీద ఆయన కూతురు షర్మిల ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఈ సభలో ముఖ్య అతిధిగా  విజయమ్మ హాజరయి ప్రసంగించారు. ప్రసంగం ముఖ్యాంశాలు:

“నాయకత్వం గురించి ఎవరైనా  వైస్సార్ ని చూసే నేర్చుకోవాలి. ప్రజల్లో  రాజశేఖర్ అంటే ఎంత అభిమానం ఉందో చెప్పలేం. ఈ రోజు మైక్ ముందుకు వారు చెప్పలేక పొవచ్చు కానీ వారి గుండెల్లో వైఎస్ ఆర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజు వైఎస్ ఆర్ అంటే  కపట ప్రేమ చూపిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ  రాజశేఖర్ రెడ్డి ని దోషి గా  చూపించింది. మమ్మల్ని రోడ్డు పైన పడేసిన మీరు(కాంగ్రెస్ నేతలు) వైస్సార్ ని ఈ రోజు భుజాలపై ఎత్తుకుంటున్నారు .  నాయకుడు అంటే భరోసా, ఒక ధైర్యం. నాయకుడు అంటే కొండను ఢీ కొట్టే దమ్ము ,ధైర్యం ఉండాలి.  ప్రజల బ్రతుకు బాగు కోరే వాడే నాయకుడు. దానికి నిలువెత్తు నిదర్శనం వైస్సార్. నాయకుడు అంటే సమస్యలు తెలుసుకొని పరిష్కరించే వాడు.  అదే  నాయకుడి లక్షణం.   తెలంగాణ లో కాదు తెలుగు ప్రజలందరి గుండెల్లో వినపడే పేరు కనపడే పేరు వైస్సార్.  రాజశేఖర్ రెడ్డి గారికి వివక్ష అంటే తెలియదు.  రాజశేఖర్ రెడ్డి కి తన కుటుంబం ఎంతో సాధారణ ప్రజలు అంతే.  రాజశేఖర్ రెడ్డి చనిపోయాడన్న దుర్వార్త  తెలియగానే ఆంధ్రలో కంటే తెలంగాణ లోనే ఎక్కువ మంది హతాశులై చనిపోయారు . కల్మషం  లేని మనసు రాజశేఖర్ రెడ్డిది.  ప్రతీ ఎకరా కి నీళ్లు ఇచ్చినప్పుడే తననా జన్మ ధన్యం అని పదే పదే చెప్పేవారు .

పల్లెలకు జీవ కళ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి.  అయిన వేసిన ప్రాజెక్టులను ఈ  రోజు కి కూడా పూర్తి చేయలేదు.  రాజశేఖర్ రెడ్డి కి జగన్ బాబు అయినా షర్మిల అయినా నిలువెత్తు వారసులు. నిజాయితీ తో కూడిన విలువలకు ఆదర్శం మా షర్మిల పార్టీ.  తెలంగాణ లో అసలు సిసలైన నాయకురాలు షర్మిల.  షర్మిల రాజన్న ముద్దుబిడ్డ.  రాజశేఖర్ రెడ్డి షర్మిల ని యువరాణి లాగా పెంచుకున్నాడు.  జగన్ పాదయాత్ర చేయాలి అని కోరినప్పడు షర్మిల చేసి చూపించారు.  భారత దేశంలో షర్మిల లాంటి అమ్మాయిలు లేరు.  షర్మిల ఏ పని చేసిన సంకల్పంతో చేస్తుంది

వైస్సార్ రాక ముందు తెలంగాణ గడ్డ మీద రక్తం మరకలుండేవి. అలాంటి నేల  మీద  నీళ్లు పారించిన ఘనుడు వైస్సార్.   తెలుగు రాష్టాలు రెండు మనవే. అభిప్రాయం బేధాలు వస్తే సమస్యలు పరిష్కరించుకోవాలి.  రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు దొంగలు కాదు.. గజ దొంగలు కానే  కాదు. మాకు దాచుకోవాడం, దోచు కోవడం తెలియదు. ఒక్క పంచడం తప్ప. రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలు కూడా ప్రజల కోసమే పోగొట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *